3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. విద్య, వ్యవసాయానికి అధిక కేటాయింపులు!

  • విద్యా శాఖకు రూ.31,805 కోట్లు, వ్యవసాయ బడ్జెట్‌ రూ.48 వేల కోట్లు
  • ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, తెలుగు భాషాభివృద్ధికి తొలిసారిగా నిధులు

ఏపీ ప్రభుత్వం తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటి రూ.3.22 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్ ప్రాజెక్టులు, మేనిఫెస్టో హామీలు, అభివృద్ధి పనుల నిధుల అవసరం ఎక్కువగా ఉండటంతో బడ్జెట్ భారీగా పెరిగింది.

విద్య, మున్సిపాల్టీలకు ప్రాధాన్యం

ఈసారి విద్య, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి అంశాలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు.

  • ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నారు.
  • పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించారు.
  • తెలుగు భాషాభివృద్ధికి తొలిసారిగా రూ.10 కోట్లు కేటాయించారు.
  • నవోదయం 2.0 కింద మద్యపానం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారానికి నిధులు కేటాయించారు.

మున్సిపాల్టీలకు కొత్త విధానం

  • 2024 ఏప్రిల్‌ నుంచి మున్సిపాల్టీలు తమ బిల్లులను స్వయంగా చెల్లించుకునేలా స్వేచ్ఛ ఇచ్చారు.
  • చిన్నపాటి అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులపై నియంత్రణ తీసివేశారు.
  • ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టులకు 20% వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇవ్వనున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *