హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు కీలకమైన సమాచారం అందించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి 10,000 వీడియోలను విశ్లేషించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో అల్లు అర్జున్ మాట్లాడుతూ, రేవతి చనిపోయిన విషయం తనకు ముందుగా తెలియదని పేర్కొన్నారని చెప్పారు.ఈ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో కమిషనర్ మాట్లాడుతూ, “కేసు దర్యాప్తు స్థితిలో ఉంది. విషయాన్ని న్యాయస్థానం పరిధిలో ఉంచి, మరికొద్ది రోజుల్లో వాదనలు జరగబోతున్నాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడలేం” అని తెలిపారు. పోలీసులు సేకరించిన వీడియోలు మరియు ఆధారాలను ప్రదర్శిస్తూ, “మీరు ఆ వీడియోను చూసి మీ నిర్ణయాన్ని తీసుకోండి” అని సూచించారు.





