
భారతదేశంలోని అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ తన లోగోను మార్చి కొత్త రూపంలో మారింది. వాల్మార్ట్ కంపెనీకి చెందిన ఈ సంస్థ తన లోగోను తొమ్మిది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మార్చింది. ఈ మార్పుతో ఫ్లిప్కార్ట్ యువతను ఆకర్షించాలని, త్వరగా వస్తువులు అందించే కొత్త కామర్స్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. కొత్త లోగోలో మునుపటి రంగులు అలాగే ఉన్నాయి కానీ, కొత్త షేడ్స్తో కనిపిస్తున్నాయి. ముందుగా ‘ఫ్లిప్కార్ట్’ అని పూర్తిగా రాసి ఉండేది, ఇప్పుడు ‘f’ అనే అక్షరం మాత్రమే కనిపిస్తోంది. ఈ మార్పుతో ఫ్లిప్కార్ట్ యువతను ఆకర్షించాలని భావిస్తోంది.
ఫ్లిప్కార్ట్ ఇటీవల ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ అనే కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా కస్టమర్లు కొన్ని నిమిషాల్లో వస్తువులను ఇంటికి తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవ కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ తన వెబ్సైట్లో ఈ సేవకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది.
బ్రాండ్ నిపుణులు ఫ్లిప్కార్ట్ చేసిన ఈ మార్పును అభినందిస్తున్నారు. ఈ మార్పు ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎంతో అభివృద్ధి చెందుతోందని, కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.





