ఏసీబీ విచారణకు హాజరుకాని మాజీ ఐఐఎస్ అధికారి!!

  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి విచారణకు హాజరుకాని పరిస్థితి.
  • ఏప్రిల్‌లోనే విచారణకు హాజరవుతానని ఏసీబీ నోటీసులకు సమాధానం.

జగన్‌ హయాంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణల కేసు నడుస్తోంది. ప్రభుత్వ ప్రకటనల బిల్లుల చెల్లింపులో సాక్షి మీడియా గ్రూప్‌కు అనుచిత లబ్ధి కల్పించారని, అక్రమ నియామకాలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ శుక్రవారం నోటీసులిచ్చినా, ప్రస్తుతం బిజీగా ఉన్నానని ఏప్రిల్‌లో మాత్రమే హాజరవుతానని సమాధానం ఇచ్చారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయనకు ఇప్పటి వరకు అరెస్టు నుంచి రక్షణ లేదు.

దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనలు రూ.371.12 కోట్లకు చేరగా, అన్ని టీవీ చానళ్లకూ కలిపి ఇచ్చిన ప్రకటనల కంటే మూడు వైకాపా అనుకూల మీడియా సంస్థలకు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చినట్లు తేలింది. ఏబీఎన్‌, టీవీ5, ఆంధ్రజ్యోతి వంటి మీడియా హౌస్‌లకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని ఏసీబీ గుర్తించింది. ఈ ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు ఏసీబీ మరోసారి విజయ్‌కుమార్‌రెడ్డికి నోటీసులు పంపనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *