- టీ20 వరల్డ్కప్ 2026 కోసం రేపు భారత జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
- శుభ్మన్ గిల్, సూర్యకుమార్ ఫామ్ పై సెలెక్టర్ల మల్లగుల్లాలు
- వికెట్కీపర్ రేసులో సంజూ శాంసన్, పంత్ మధ్య పోటీ
- యశస్వి జైస్వాల్, రింకు సింగ్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 World Cup కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ రేపు తుది నిర్ణయం తీసుకోనుంది. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన వెంటనే ఈ ప్రకటన వెలువడనుంది. మెగా టోర్నీకి ముందు భారత్ కు కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రస్తుతం ఎంపిక చేసే జట్టే వరల్డ్కప్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి(India Squad Announcement T20 World Cup 2026).
వికెట్ కీపింగ్ & బ్యాటింగ్ సవాళ్లు:
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానంగా వికెట్ కీపింగ్ విభాగంలో స్పష్టత కొరవడింది.
- కీపర్ రేసు: సంజూ శాంసన్, జితేశ్ శర్మలతో పాటు ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
- ఓపెనింగ్ జోడీ: అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్ను తిరిగి జట్టులోకి తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
- రింకు సింగ్ భవితవ్యం: వరుసగా రెండో టీ20 వరల్డ్కప్ను రింకు సింగ్ కోల్పోయే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది.
సూర్య, గిల్ ఫామ్ పై ఆందోళన
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నప్పటికీ వీరిద్దరి ప్రస్తుత ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గిల్ పై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు గాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ ఎంపికపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. అగార్కర్ కమిటీ తీసుకునే ఈ నిర్ణయాలు మెగా టోర్నీలో భారత్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి.






