‘ఎల్ 2: ఎంపురాన్’ వివాదంపై మోహన్‌లాల్ స్పందన – సన్నివేశాలు తొలగింపు

  • “చిత్రబృందం తరఫున క్షమాపణలు” – మోహన్‌లాల్
  • వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నామని స్పష్టం

స్వీయ నటనలో తెరకెక్కిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మోహన్‌లాల్ (Mohanlal) స్పందించారు. తన సినిమా ఏ రాజకీయ భావజాలానికీ, మతానికి వ్యతిరేకంగా ఉండదని స్పష్టం చేస్తూ, ‘‘కొన్ని సన్నివేశాలు కొందరిని బాధించాయి. నాపై ప్రేమ, విశ్వాసాన్ని కాపాడుకోవడమే నా కర్తవ్యము. అందుకే వీటిని తొలగించేందుకు నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు.

కేరళ సీఎంగా మద్దతు!!

వివాదం తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ కుటుంబంతో కలిసి ‘ఎంపురాన్’ వీక్షించారు. చిత్ర బృందానికి మద్దతు ప్రకటిస్తూ, భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు అవసరమని పేర్కొన్నారు. సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ కొన్ని సన్నివేశాలు చూపించారని, అవి ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సినిమా నిలిపివేయాలని డిమాండ్ పెరిగింది. నిర్మాత గోకులం గోపాలన్ ఇప్పటికే స్పందించగా, ఇప్పుడు మోహన్‌లాల్ తన వైఖరిని వెల్లడించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *