- తండేల్ సినిమాపై నాగచైతన్య సతీమణి శోభితా పోస్ట్
- పోస్ట్ చూసి చైతన్య స్పందన – “థాంక్యూ బుజ్జితల్లి”
నాగచైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’ సినిమా విడుదల సందర్భంగా, ఆయన సతీమణి శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తండేల్ పోస్టర్ను షేర్ చేస్తూ, ఈ సినిమా కోసం చైతన్య ఎంత ఫోకస్తో పని చేశాడో తనకు తెలుసని, సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, చైతన్య చివరికి గడ్డం షేవ్ చేసుకుంటాడంటూ సరదాగా రాసుకొచ్చారు. దీనికి చైతన్య స్పందిస్తూ – “థాంక్యూ బుజ్జితల్లి” అంటూ రిప్లై ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల అసలు సంఘటన ఆధారంగా రూపొందిన ‘తండేల్’లో, నాగచైతన్య తండేల్ రాజుగా, సాయిపల్లవి బుజ్జితల్లిగా నటించారు. ఈ పాత్ర కోసం చైతన్య తొమ్మిది నెలల పాటు సన్నద్ధమయ్యారు. పొడవాటి జుత్తు, గడ్డంతో కనిపించనున్న చైతన్య, సినిమా షూటింగ్ నాటినుంచి గడ్డంలోనే ఉన్నారు.
చై-శోభిత స్నేహం నుంచి పెళ్లి వరకు!!
చైతన్య, శోభిత చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. 2023 డిసెంబర్లో వీరి పెళ్లి జరిగింది. ఇటీవల ఇంటర్వ్యూలో చైతన్య, శోభిత గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె తెలుగులో చక్కగా మాట్లాడుతుందని, భాషా విషయాల్లో తనకు సహాయం చేస్తుందన్నారు. అంతేకాదు, ఫ్యాషన్పై మంచి అభిరుచి ఉన్న శోభిత, తనకు దుస్తులు కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు.





