నారా లోకేశ్‌ చొరవతో నిరుపేదకు గుండె దానం

  • బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవదానం
  • లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు – సకాలంలో గుండె మార్పిడి
  • జీవన్‌దాన్‌ ట్రస్టు ద్వారా పలువురికి అవయవాలు అందుబాటులోకి

గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. జీవన్‌దాన్‌ ట్రస్టు సమన్వయంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. ఈ అవయవాలను గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని ఆసుపత్రులకు తరలించేందుకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.

లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు:

గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ నిరుపేద రోగికి గుండె మార్పిడి అవసరం ఉంది అని తెలిసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే స్పందించి, గుండెను సకాలంలో తిరుపతికి తరలించేందుకు తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట వరకు గుండెను తీసుకెళ్లి విజయవంతంగా రోగికి అమర్చారు. “అమ్మ చేసిన అవయవదానంతో పలువురి జీవితాల్లో ఆమెను చూసుకునే అవకాశం లభించింది” అని సుష్మ కుమార్తెలు తెలిపారు. మంత్రి లోకేశ్‌ తీసుకున్న నిర్ణయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *