యెమెన్‌లో నిమిష ప్రియకు ఊరట! ఉరిశిక్ష రద్దుకు కీలక నిర్ణయం!?

  • యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు పెద్ద ఊరట. ఆమె ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.
  • సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వచ్చిందని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది.
  • ఆమె విడుదలపై ఇంకా స్పష్టత లేదు; మరణించిన యెమెన్ పౌరుడి కుటుంబంతో చర్చల తర్వాతే తుది నిర్ణయం.

యెమెన్‌లో మరణశిక్ష పడి, ఆందోళనలో ఉన్న భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) విషయంలో ఒక పెద్ద ఊరట లభించింది. ఆమె ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వచ్చిందని భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, భారత విదేశాంగ శాఖ నుంచి మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారని మీడియా వర్గాలు తెలిపాయి.

ముఫ్తీ చొరవతో చర్చలు ఫలం

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు, యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక ప్రత్యేక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు, అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చలు ఫలించడంతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం వెల్లడించింది. అబూబకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధృవీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

విడుదలపై ఇంకా సందిగ్ధత

అయితే, నిమిష ప్రియ విడుదలపై సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిష ప్రియ జైలు నుంచి పూర్తిగా విడుదల అవుతుందా, లేదా జీవితఖైదు పడే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి తెలియదని అన్నారు. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. నిమిష ప్రియ, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ పలుమార్లు కోరింది. దీంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చురుగ్గా చర్చలు జరుపుతోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.