నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్: వీళ్ల పాత్ర చాలా కీలకం.. ఎవరా నలుగురు!?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫిబ్రవరి 1న తన ఎనిమిదవ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫిబ్రవరి 1న తన ఎనిమిదవ బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తుందని సమాచారం. ఇప్పటికే, బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా ‘హల్వా వేడుక’ ముగిసింది. ఈ బడ్జెట్‌ను రూపొందించడానికి బాధ్యత వహిస్తున్న కీలక వ్యక్తులను పరిశీలిద్దాం.

కీలక వ్యక్తులు:

  • తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి): 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే.
  • వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు.
  • మనోజ్ గోవిల్ (డిపార్ట్‌మెంట్ ఆప్ ఎక్స్‌పెండిచర్ కార్యదర్శి): 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.
  • అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి): 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఈ వ్యక్తులు, బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు, మరియు రాబోయే సెషన్‌లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *