వన్ ప్లస్ కాలేజీ స్టూడెంట్స్ కోసం ₹6 లక్షల ప్రైజ్ పూల్ ఉన్న నేషనల్ గేమింగ్ టోర్నమెంట్ తెచ్చింది.
టాప్ 2 టీమ్స్కి బీజీఎంఎస్ 2025లో ఇండియాలోని బెస్ట్ గేమర్స్తో పోటీపడే ఛాన్స్!
హేయ్ గేమర్స్! మీ కాలేజీలో మీరే కింగ్, క్వీన్ అని నిరూపించుకోవడానికి రెడీనా? అయితే వన్ ప్లస్ నుండి అదిరిపోయే న్యూస్! వాళ్ళు ‘క్యాంపస్ డామినేట్ – రోడ్ టు బీజీఎంఎస్’ అనే సూపర్ నేషనల్ గేమింగ్ టోర్నమెంట్ను ప్రకటించారు. ఇది కాలేజీ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. గెలిచిన వారికి ₹6 లక్షల ప్రైజ్ పూల్, అల్టిమేట్ గ్లోరీ మీ సొంతం!
ఛాన్స్ అదిరింది కదా? ఎలా జాయిన్ అవ్వాలంటే..
ఈ టోర్నమెంట్లో టాప్ 2 టీమ్స్ ఏకంగా బీజీఎంఎస్ (BGMS) 2025లో – ఇండియాలో జరిగే అతిపెద్ద బీజీఎంఐ (BGMI) ఈ-స్పోర్ట్స్ లీగ్లో – ఆడే అవకాశం పొందుతారు. ఇది మామూలు ఛాన్స్ కాదు, మీ గేమింగ్ కెరీర్కు అదిరిపోయే బూస్ట్! రిజిస్ట్రేషన్స్ ఈ నెల జూన్ 26 నుండి జూలై 12, 2025 వరకు ఓపెన్లో ఉంటాయి. ఇండియాలోని ఏ కాలేజీ స్టూడెంట్ అయినా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. వన్ ప్లస్ ఇండియా ప్రొడక్ట్ స్ట్రాటజీ డైరెక్టర్, మార్సెల్ క్యాంపోస్ మాట్లాడుతూ, “గేమింగ్ అనేది వన్ ప్లస్ కమ్యూనిటీకి గుండె లాంటిది. క్యాంపస్ డామినేట్తో, స్టూడెంట్ గేమర్స్కి ప్రో ప్లేయర్గా మారడానికి నిజమైన అవకాశం ఇస్తున్నాం” అని చెప్పారు. వన్ ప్లస్ నార్డ్ 5 (Qualcomm Snapdragon 8s Gen 3, 90fps BGMI, 144fps CoD Mobile) మరియు వన్ ప్లస్ నార్డ్ సీఈ5 వంటి పవర్ఫుల్ డివైజ్లతో గేమింగ్ను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. గేమింగ్లో మీ స్పిరిట్ చూపించడానికి ఇది పర్ఫెక్ట్ టైమ్!