పనితీరు మార్చుకోండి.. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్!

  • ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • ప్రతి ఒక్కరికీ పనితీరు నివేదికలు ఇచ్చి, వాటిపై వివరణ కోరారు.
  • పదవుల వ్యామోహంలో పడి మూలాలు మర్చిపోవద్దని పవన్ సూచించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీ పనితీరును నేను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. నా దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. కచ్చితంగా మీ పనితీరును మార్చుకోవాలి. కార్యకర్తలకు చేరువగా ఉండాలని గుర్తుంచుకోండి,” అని పవన్ అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చారంటే, మీరు నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు వారధులుగా ఉంటారని అర్థం అని పవన్ తెలిపారు. చాలా మంది పదవుల గురించి మాట్లాడుతున్నారని, పదవుల వ్యామోహంలో పడి మూలాలను మర్చిపోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ స్పందన

సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ కేసు విషయంలో “పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు” అన్నట్లుగా తన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎవరూ సీఎం ఎదుట మాట్లాడే ధైర్యం చేయలేదని, ఆ సమయంలో తాను కర్నూలు వెళ్లి గళం వినిపించానని గుర్తుచేశారు. తన పోరాటం ఫలితంగా అప్పటి ప్రభుత్వం కేసును నడిపిందని, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల వ్యవసాయ భూమి, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారని పవన్ తెలిపారు. తాను ఉపముఖ్యమంత్రి అయ్యాక సీఐడీ చీఫ్, డీజీపీ, హోం మంత్రితో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించినట్లు పవన్ చెప్పారు. అయితే, ఈ కేసు విచారణలో అనుమానితుల డీఎన్‌ఏ సరిపోలడం లేదని, సాక్ష్యాలు తారుమారు అయ్యాయని తేలిందని ఆయన వివరించారు.

కార్యకర్త ఇంటిలో నిద్ర..

కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకునే విధానాన్ని ప్రారంభించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ విషయాన్ని గాజువాకకు చెందిన సురేష్ కుమార్ అనే కార్యకర్త సూచించారని, అది తనకు బాగా నచ్చిందని పవన్ అన్నారు. త్వరలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సురేష్ కుమార్ ఇంటికే మొదట వెళ్తానని పవన్ పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *