రజనీ తలైవానే కాదు.. ఇక గుడిలో దేవుడు కూడా!!

సూపర్‌స్టార్ రజినీకాంత్, భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ వ్యక్తిత్వం, నేడు 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన స్టైలిష్‌ పర్‌ఫార్మెన్స్ మరియు ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను మంత్రిత్మకంగా మార్చారు. 80వ దశకంనాటి నుండి ఇప్పటి వరకు ఆయన మేనరిజం కొనసాగుతోంది, అందుకే తమిళ తంబీలు ఆయనను ఎప్పటికీ అభిమానిస్తుంటారు.రజినీకాంత్ బెంగళూరులో జన్మించారు, ఐదేళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆయన, కండక్టర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో తన సినీ ప్రస్థానం ప్రారంభించారు.అయన నటించిన తొలి సినిమానే మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకోవడం విశేషం. ‘భైరవి’ చిత్రం తర్వాత ఆయనకు ‘సూపర్‌స్టార్’ అనే పేరు వచ్చింది. రజినీకాంత్ 2002లో ‘బాబా’ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు స్వయంగా సొమ్ము చెల్లించారు. పుట్టిన రోజు సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మదురై జిల్లాలోని తిరుమంగళం అనే ప్రాంతంలో రజినీకి ఓ ఆలయాన్ని నిర్మించాడు ఓ అభిమాని. ఆయన పేరు కార్తిక్. మాజీ సైనికుడు.

రజినీకాంత్‌గారి 74వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం రజినీకాంత్ నటించిన ‘మాప్పిళ్లై’ చిత్రంలోని ఆయన పాత్రను ఆధారంగా తీసుకొని రూపొందించబడింది. నల్లరాతితో తయారు చేయబడిన ఈ విగ్రహం 3 అడుగుల ఎత్తు మరియు 350 కిలోల బరువు కలిగి ఉంది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 6 నెలల కాలం పట్టిందని కార్తిక్ తెలిపారు. కార్తిక్ తనను తాను రజినీకాంత్‌కు అతి పెద్ద అభిమానిగా పరిచయం చేసుకుంటూ, ఆయన అభిమానంలో భాగంగానే ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్పారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ రజినీకాంత్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *