- దిల్లీ బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా రేఖ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నిక
- ఫిబ్రవరి 20న రామ్లీలా మైదానంలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి, 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమై పెద్ద దెబ్బతిన్నింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. రేఖ గుప్తా ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 20న మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది సినీతారలు, పారిశ్రామికవేత్తలు, 20 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.





