- భార్యల వేధింపుల వల్ల భర్తలు ఆత్మహత్య చేసుకోవడం పెరిగింది.
- ఇటీవల కర్ణాటకలో ఓ వ్యక్తి భార్య వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భారతదేశంలో భార్యల వేధింపుల కారణంగా మగవారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతంలో కోడళ్లు అత్తమామ్మలు, భర్తల చేత బాధపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మగవారు కూడా భార్యల వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అతను భార్య వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో పీటర్ గొల్లపల్లి అనే వ్యక్తి కూడా భార్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను తన సూసైడ్ నోట్లో “పింకీ వేధింపులు భరించలేక చనిపోతున్నా” అని రాశాడు. ఈ సంఘటనలు మగవారిపై గృహహింసపై చర్చలను ప్రేరేపిస్తున్నాయి. మగవారికి కూడా చట్టాలు రావాలనే డిమాండ్ పెరుగుతోంది.





