
తెలుగు సినీ నటి సాయి పల్లవి తన ఆరోగ్యం ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వెజిటేరియన్గా ఉన్న ఆమె, ఈ మధ్య వచ్చిన కొన్ని అసత్య వార్తలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ మీడియాలో సాయి పల్లవి నాన్-వెజ్ తినడం లేదని వచ్చిన వార్తలు ఆమె అభిమానులను కలచివేశాయి. తన రాబోయే సినిమా ‘రామాయణం’ కోసం ఆమె తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లు కొన్ని వార్తలు ప్రచారం చేశాయి. దీంతో సాయి పల్లవి తన సోషల్ మీడియా ద్వారా స్పందించి ఈ వార్తలను ఖండించారు. సాయి పల్లవి తన స్పందనలో, తాను ఎప్పటిలాగే వెజిటేరియన్గానే ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి అవాస్తవ వార్తలు రాసే వారిని తీవ్రంగా హెచ్చరించారు. తన మీద వచ్చే వార్తలను రాసే ముందు నిజాలు నిర్ధారించుకోవాలని మీడియాను కోరారు. ఇలాంటి అసత్య వార్తల వల్ల తనకు మాత్రమే కాకుండా, తన అభిమానులకు కూడా మానసికంగా చాలా బాధ కలుగుతుందని ఆమె వాపోయారు. లైన్ దాటితే ఇకపై ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. లీగల్ నోటీసులిచ్చేందుకైనా వెనకాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.





