బాలీవుడ్లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఆమె ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన సయామీ ఖేర్. ఆమె ప్రయాణంలో కొన్ని ఆసక్తికర విశేషాలు.
నాసిక్కు చెందిన సయామీ ఖేర్ తన నటిగా ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే మొదలు పెట్టారు. ఆమె మొదటి సినిమా ‘రేయ్’. ఆ తర్వాత ‘వైల్డ్డాగ్’, ‘హైవే’ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కొంతకాలంగా బాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమె, ‘ఘూమర్’ అనే సినిమాలో క్రికెటర్ కావాలని కలలు కనే దివ్యాంగురాలిగా అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు ఆమెకు ‘ఐకానిక్ గోల్డ్ అవార్డు’ కూడా వచ్చింది. సయామీ తన ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆమె ‘రా’ ఏజెంట్ పాత్రలకు సరిగ్గా సరిపోతారు. ‘వైల్డ్డాగ్’, ‘స్పెషల్ ఓపీఎస్’ వెబ్ సిరీస్లు దానికి నిదర్శనం.

సినిమా బ్యాక్గ్రౌండ్.. సక్సెస్ ఫుల్ కెరీర్
సయామీది సినిమా నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి అద్వైత్ ఖేర్ ఒకప్పుడు మోడల్. తల్లి ఉత్తర 80లలో అందాల కిరీటం గెలుచుకున్నారు. దివంగత నటి ఉషాకిరణ్కు ఈమె మనవరాలు. తన్వి అజ్మీకి మేనకోడలు. ఇలాంటి కుటుంబంలో పుట్టడం వల్ల డిగ్రీ పూర్తవ్వగానే సయామీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
నటనలోనే కాదు.. ఆటల్లోనూ మేటి

సయామీ నటిగానే కాకుండా ఆటల్లోనూ చాలా ప్రతిభావంతులు. ఆమె ట్రయథ్లాన్ పోటీలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఏడాదిలోనే రెండు సార్లు ‘ఐరన్మ్యాన్ 70.3’ పోటీని పూర్తి చేసిన మొదటి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. ఈ పోటీలో 1.9 కి.మీ. ఈత, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు పందెం.. ఈ మూడు క్రీడల్లో వరుసగా పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటి కఠినమైన పోటీని పూర్తి చేయడం సయామీలోని పట్టుదలను, ఫిట్నెస్ను చూపిస్తుంది.





