- “అధిష్ఠానం నిర్ణయమే మంత్రివర్గ విస్తరణకు కీ”
- “ప్రతిపక్ష నేతల అరెస్టులపై ఆలోచన లేదు” – సీఎం స్పష్టం
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. “నేను ఎవరినీ సిఫారసు చేయడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశారు. “తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఆలోచన నాకు లేదు” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
“కులగణనలో అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకున్నాం”
కులగణనపై స్పందించిన సీఎం “ఇది హడావుడిగా చేసిన లెక్కలు కావు” అన్నారు. అన్ని వివరాలతో కూడిన సర్వేలో బీసీలు 5.30% పెరిగినట్లు తేలిందని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని, అధిష్ఠాన ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని చెప్పారు. “తెగతెంపులుగా నిర్ణయాలు ఉంటాయని అనుకునేవారు తప్పులో పడ్డారు” అని ఘాటుగా స్పందించారు.





