- తమిళనాడులో ధోనీ కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తానని ప్రశాంత్ కిశోర్ ధీమా
- 2026లో విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలిస్తే, తమిళంలో ప్రసంగిస్తానని హామీ
తమిళనాడులో తన తోటి బిహారీ మహేంద్రసింగ్ ధోనీ కంటే ఎక్కువ పాపులారిటీ సాధిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని గెలిపిస్తానని చెన్నైలో జరిగిన పార్టీ వార్షికోత్సవంలో అన్నారు. “నా పోటీ ధోనీతోనే. ఆయన చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. టీవీకే గెలిస్తే, నేనూ తమిళనాడులో అతను సాధించినంత ప్రజాదరణ పొందుతాను. విజయ్కు ప్రత్యేక సలహాదారుగా పని చేస్తా” అని ప్రకటించారు.
“తమిళనాడు మోడల్ దేశానికి ఆదర్శం”
ప్రస్తుతం తమిళనాడులో ధోనీ తర్వాత పాపులర్ బిహారీ తానేనని, త్వరలో ఆ స్థాయిని మరింత పెంచుకుంటానని చెప్పారు. “నాకు తమిళం పూర్తిగా రాదు, కానీ అర్థమవుతుంది. టీవీకే గెలిచాక ప్రజలతో తమిళంలోనే మాట్లాడతా” అని హామీ ఇచ్చారు. తమిళనాడు గుజరాత్ మోడల్ కంటే మెరుగైన అభివృద్ధి మోడల్ అందిస్తుందని, మతతత్వానికి ఎప్పుడూTamil Nadu ప్రజలు అంగీకారం చెప్పలేదని పేర్కొన్నారు.

“1967, 1977 తరహా ఫలితాలు 2026లో రిపీట్ చేస్తాం” అని టీవీకే అధినేత విజయ్ ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ, డీఎంకే పరస్పర విమర్శలతో అసలు సమస్యల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజల డిమాండ్లను నెరవేర్చలేని ప్రభుత్వాలు గెట్ ఔట్!” అంటూ విజయ్ #GetOutBJPandDMK ప్రచారాన్ని ప్రారంభించారు.





