- జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడులో 44వ జాతీయ రహదారిపై యువకుడి ప్రమాదకరమై ఫీట్
- ట్రాక్టర్పై పడుకుని వేగంగా డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.
జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఓ యువకుడు చేసిన ప్రమాదకర స్టంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మానవపాడు నుంచి ఉండవల్లి వరకు నేషనల్ హైవేపై ట్రాక్టర్ను వేగంగా నడుపుతూ, ఏకంగా దానిపై పడుకుని డ్రైవింగ్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ కోసం చేసిన ఈ స్టంట్ రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రహదారిపై ఇలాంటి స్టంట్లు గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చూడగా, ఇవి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం యువత చేసే ఇలాంటి చర్యలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని, రహదారి భద్రతపై అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వేలాది వీక్షణలు సాధించింది. పోలీసులు యువకుడిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు.





