హనీమూన్‌ హత్య కేసులో కొత్త మలుపు: ‘సంజయ్‌ వర్మ’ పేరు వెనుక అసలేం ఉంది?

  • సోనమ్‌ ప్రియుడు రాజ్‌ కుష్వాహానే ‘సంజయ్‌ వర్మ’గా సంభాషించినట్టు పోలీసులు అనుమానం
  • 39 రోజుల్లో 234 సార్లు ఫోన్‌ కాల్స్‌: విచారణలో కీలక ఆధారాలు
  • రఘువంశీ హత్య కేసులో కీలక మలుపు తిరిగే అవకాశాలు
  • సంజయ్‌ కాదు… రాజ్‌ కుష్వాహానేనా?

హనీమూన్‌ సందర్భంగా మేఘాలయ వెళ్లిన రఘువంశీ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సోనమ్‌ ప్రియుడి పేరుగా గుర్తించిన సంజయ్‌ వర్మ అనే వ్యక్తి అసలు పేరు రాజ్‌ కుష్వాహా కావచ్చని తాజా కథనాలు సూచిస్తున్నాయి. తన ప్రియుడి అసలు గుర్తింపు దాచేందుకు సోనమ్‌ అతని నంబరును ‘సంజయ్‌ వర్మ’గా సేవ్‌ చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మధ్య 39 రోజుల్లో 234 సార్లు ఫోన్‌ సంభాషణ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇది కేసులో కీలక ఆధారంగా మారింది. ఇంతకుముందు పోలీసులు రఘువంశీ కుటుంబసభ్యులను అడిగినప్పుడు ‘సంజయ్‌ వర్మ’ అనే పేరు వాళ్లకు తెలియదని చెప్పారు.

ముఖ్యంగా మే 11న రఘువంశీ, సోనమ్‌ వివాహం జరిగితే, మే 20న వారు హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత రఘువంశీ కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత ఓ జలపాతం సమీపంలో ఆయన శవం బయటపడింది. సోనమ్‌ తరువాత గాజీపూర్‌లో కనిపించగా, విచారణలో ఆమెతో పాటు నలుగురు కలిసి హత్యకు పాల్పడ్డట్టు వెల్లడైంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *