చంద్రబాబు కుట్రలు బట్టబయలు? అరెస్టులపై అంబటి రాంబాబు షాకింగ్ ఆరోపణలు!

వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 22, 2025న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి, విషయాల డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టులను విశాఖలోని ఉర్స్ స్కామ్‌పై దృష్టి మళ్లించే కుట్రగా అభివర్ణించారు. కడంబరి జత్వాని అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, ఆమె బ్లాక్‌మెయిలర్‌గా బొంబాయిలో అందరికీ తెలుసని, చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలతో పీఎస్ఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అబద్ధాల కోరు అని అందరూ అనుకుంటున్నారు. ఉర్స్ స్కామ్‌ను లోకేష్ సృష్టించాడు. దాన్ని దాచేందుకే పీఎస్ఆర్, కసిరెడ్డి అరెస్టులు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది. పోలీసులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాలి,” అని అంబటి రాంబాబు హెచ్చరించారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఉర్స్ స్కామ్‌లో రూ.3,000 కోట్ల ఆస్తులను లోకేష్ సృష్టించిన సంస్థకు ఇచ్చారని, ఈ అవినీతిని కప్పిపుచ్చేందుకే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారని, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గోరంట్ల మాధవ్ కేసులో 11 మంది అధికారుల సస్పెన్షన్‌పై హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా చంద్రబాబుకు సిగ్గు లేదని, ఈ రాజకీయ కుట్రలకు ప్రజలు, దేవుడు మూల్యం చెల్లింపజేస్తారని హెచ్చరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *