పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం – హాజరు 98.27%

  • రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులలో 6,16,451 మంది హాజరు
  • కర్నూలులో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులు డిబార్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, 98.27% విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు తెలిపారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 1,545 కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్లు తనిఖీ చేశాయి.

ఇన్విజిలేటర్ పొరపాటుతో విద్యార్థికి సమస్య

తెనాలిలోని ఐతానగర్‌లో ఓ విద్యార్థిని కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా, పొరపాటున జనరల్ తెలుగు పేపరు రాసింది. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా చివరి సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డీఈవో సీవీ రేణుక విచారణ జరిపి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.