2024 భారతదేశ రాజకీయ పరిణామాలు: ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలు ఇవే!

2024 ఏడాది భారతదేశ రాజకీయ రంగం అనేక ఉత్కంఠభరిత ఘటనలతో సజీవంగా నిలిచింది. సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అంచనాలు తారుమారు చేసిన ఫలితాలు, అనూహ్య రాజీనామాలు—ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు కొత్త చరిత్రను లిఖించాయి.

లోక్‌సభ ఎన్నికలు 2024
2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకూ ఏడు దశల్లో జరగ్గా, ఫలితాలు సంచలనాలకు దారితీశాయి. ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అయినప్పటికీ, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా కీలక పోటీ ఇచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్‌ సంచలన రాజీనామా
తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఊహించని ప్రకటన చేశారు. “ప్రజల తీర్పు క్లీన్ చిట్‌గా వచ్చినప్పుడు మాత్రమే సీఎంగా తిరిగి బాధ్యతలు చేపడతాను” అని కేజ్రీవాల్‌ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల మలుపు
మహారాష్ట్రలో ఈ ఏడాది లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలు భిన్న దిశలో ప్రవహించాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి నిరాశ చెందగా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జమ్ముకశ్మీర్‌: దశాబ్దం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు
2024లో జమ్ముకశ్మీర్‌ రాజకీయ చరిత్రలో ప్రత్యేక ఘట్టం లిఖించబడింది. దశాబ్దం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం విశేషం. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం మొదటి ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఘన విజయం సాధించి, ఒమర్‌ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

నవీన్‌ పట్నాయక్‌ రాజకీయ పతనం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా మార్పులు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా ఒడిశాలో అధికారాన్ని కైవసం చేసుకున్న నవీన్‌ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీ ఓటమిని చవిచూసింది. భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాహుల్‌ గాంధీ పునరాగమనం
2024 లోక్‌సభ ఎన్నికలు రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన విజయాన్ని అందించాయి. 2019లో అమేథీలో ఓటమిని చవిచూసిన రాహుల్, ఈసారి రాయ్‌బరేలీ మరియు వయనాడ్‌ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. తర్వాత ఆయన వయనాడ్‌ స్థానాన్ని వదిలిపెట్టి రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.

ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం
2024లో ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వయనాడ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 64.99% ఓట్లతో ఘన విజయం సాధించారు.

సిక్కింలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ
సిక్కింలో ఈ సంవత్సరం రాజకీయంగా అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 32 సీట్ల అసెంబ్లీలో అన్ని స్థానాలను అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) కైవసం చేసుకోవడంతో ప్రతిపక్షం లేకుండా పోయింది.

ఢిల్లీ సీఎంగా అతిషి
కేజ్రీవాల్‌ రాజీనామా తర్వాత ఢిల్లీ సీఎం పదవి ఎవరు చేపడతారు అనే చర్చలు జోరుగా జరిగాయి. ఈ నేపథ్యంలో మనీష్‌ సిసోడియా కూడా పదవులకు రాజీనామా చేయడంతో, ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నాయకురాలు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.