ఆక్రమణలో ఉన్న అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ!!: కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పార్థసారథి వెల్లడించారు. 2019 అక్టోబర్‌ 15 నాటికి ఆక్రమణలో ఉన్న నివాసాలకు సంబంధించి క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

ఆక్రమణల క్రమబద్ధీకరణ

  • 15.10.2019 నాటికి ఆక్రమణలో ఉన్న అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తారు.
  • జీవో నం.84 ప్రకారం అర్బన్‌ ల్యాండ్‌సీలింగ్‌ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
  • వైకాపా ప్రభుత్వం తొలగించిన భూములు, ఇనాం భూములు తదితర భూములపై రీ-సర్వే ద్వారా అవకతవకలు వెలుగు చూసినట్లు మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని మంత్రివర్గ నిర్ణయాలు

  • సొసైటీ ద్వారా విరాళాల సేకరణ:
    నాగావళి నదిపై 3.7 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి.
    చిన్న విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీలకు ప్రోత్సాహం.
  • రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం:
    కృష్ణానదికి వరదల సమయంలో ముంపు నివారణకు తాడేపల్లి వైపు మరో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.294 కోట్ల ఆమోదం.
  • ఆధునిక పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి:
    వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి మండలంలో 2,595 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో 2,661 ఎకరాలను ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు నిర్ణయం.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.