కోడ్ వస్తే తోపులు కాదండోయ్.. సీఈఓలా ఆలోచిండమే ముఖ్యం!!

AI వల్ల కోడింగ్‌ పనులు తగ్గిపోతాయి, ఆలోచనల విలువ పెరుగుతుంది.. “ఇంజినీర్లు CEOలా ఆలోచించాలి… దిశని నిర్ణయించాలి.. ఒకప్పుడు కోడ్ ఎలా రాస్తారో చెప్పేవారు స్టార్ లు. కానీ ఇప్పుడు కేవలం కోడ్ రాయడమే కాదు, వ్యాపార దృష్టితో ఆలోచించగలవారే టెక్ వరల్డ్‌లో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తారు అంటున్నారు ఓపెన్‌ఏఐ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్

మీరు ఒక సాఫ్ట్‌వేర్ డెవలపరా? భవిష్యత్తులో మీ పాత్ర ఏమవుతుందోనని ఆలోచిస్తున్నారా? కృత్రిమ మేధ (AI) పుణ్యమా అని, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు కేవలం కోడింగ్ చేసే స్థాయి నుంచి ఏకంగా కంపెనీలకు సీఈఓలు అయ్యే స్థాయికి ఎదుగుతారని అంచనా వేస్తున్నారు. ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు… స్వయంగా ఓపెన్‌ఏఐ (OpenAI) ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నారాయణన్. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కోడర్లుగా కాకుండా, వ్యాపార నాయకులుగా ఆలోచించడం నేర్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా వేగంగా దూసుకుపోతోంది. దీని వేగానికి చాలా పరిశ్రమలు తట్టుకోలేకపోతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. ఓపెన్‌ఏఐలో అత్యంత అధునాతన టూల్స్‌ను, ముఖ్యంగా క్లౌడ్ ఆధారిత ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ టూల్ అయిన కోడెక్స్‌ను రూపొందించడంలో శ్రీనివాస్ నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన సంగం 2025 ఇన్నోవేషన్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ భవిష్యత్తు కేవలం కోడింగ్ లైన్లకే పరిమితం కాదని చెప్పారు.

ఐఐటీ మద్రాస్ ఆలుమినీ అసోసియేషన్ నిర్వహించిన సంగమ్ 2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ – “AI యంత్రాలు ఇప్పుడు ఫలితాలు ఇచ్చే దశ దాటి, పనులు చేసే స్థాయికి వచ్చేశాయి. మనం ఇక టెక్నికల్ మిన్యూట్‌లపై కాకుండా, దిశపై ఆలోచించాలి” అని చెప్పారు.

“బాస్‌లా ఆలోచించండి… ఏఐ మీ పనిని సులువు చేస్తుంది!”

“ఇది బాస్‌లా ఆలోచించడం లాంటిది,” అని నారాయణన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇంజనీర్ల బాధ్యత వివరాలను అమలు చేయడం నుండి వ్యూహాత్మక దృష్టికి మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏఐ సిస్టమ్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కంటే చాలా దూరం వెళ్తున్నాయి,” అని నారాయణన్ వివరించారు. యంత్రాలు సాంకేతిక వివరాలను చూసుకుంటున్నప్పుడు, మానవ ఇంజనీర్లు ప్రాజెక్టుల ‘ఏమిటి’ (What) మరియు ‘ఎందుకు’ (Why) అనే వాటిపై దృష్టి సారించాలని, ‘ఎలా’ (How) అనే అంశాన్ని ఎక్కువగా తెలివైన సిస్టమ్స్ చూసుకుంటాయని ఆయన అన్నారు. ఈ మార్పు కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు, సామర్థ్యాన్ని పెంపొందించడం అని ఆయన నొక్కి చెప్పారు. “పెద్దగా ఆలోచించగల సామర్థ్యం ప్రజలకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది,” అని ఆయన అన్నారు. మారుతున్న ఈ వాతావరణంలో విజయవంతం అయ్యే వారు, వ్యవస్థాపకులకు, సీఈఓలకు ఒకప్పుడు పరిమితమైన విస్తృత దృక్పథాన్ని స్వీకరించే వారేనని ఆయన తెలిపారు.

నారాయణన్ దృష్టి ప్రకారం, ఏఐ చిన్న టీమ్‌ల ప్రభావాన్ని భారీగా పెంచుతుంది. “ఒక సంస్థ తమ వద్ద ఉన్న వ్యక్తులతో చాలా ఎక్కువ పనులు చేయగలగాలి,” అని ఆయన అన్నారు. ఏఐ వ్యక్తులకు, వ్యాపారాలకు వారి సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచడం ద్వారా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలదని ఆయన సూచించారు.

పరిశోధనలో ఏఐ విప్లవం… బాధ్యతాయుతమైన అమలు ముఖ్యం!

ఇంజనీరింగ్ రంగాన్ని మించి, ఏఐ పరిశోధనలో కూడా ఎలా విప్లవం సృష్టిస్తుందో నారాయణన్ వివరించారు. సంక్లిష్ట శాస్త్రీయ ప్రశ్నలను పరిష్కరించడం నుండి కీలకమైన వైద్య నిర్ధారణలలో సహాయం చేయడం వరకు ఏఐ పాత్రను ఆయన హైలైట్ చేశారు. అరుదైన జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడంలో ఏఐ వినియోగాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. వేగం, కచ్చితత్వంతో జీవితాలను మార్చే ఫలితాలను ఏఐ ఎలా అందిస్తుందో ఇది తెలియజేస్తుందని ఆయన అన్నారు. తన ఆశావాదం ఉన్నప్పటికీ, ఇలాంటి శక్తివంతమైన సాధనాలను బాధ్యతాయుతంగా అమలు చేయడంలో సవాళ్లను నారాయణన్ అంగీకరించారు. “మొదటి ప్రయత్నంలోనే మనం ప్రతిదీ సంపూర్ణంగా పొందలేము, కానీ మనం వేగంగా నేర్చుకుంటాం, మెరుగుపరుచుకుంటాం,” అని ఆయన అన్నారు. తమ విధానంలో నమ్మకం, పారదర్శకత ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

AI ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వరకే కాదు… మెడికల్ రీసెర్చ్, జన్యుపరమైన వ్యాధుల గుర్తింపు వంటి కీలక రంగాల్లోనూ అద్భుతాలు చేస్తోందని తెలిపారు. “మనం తప్పులు చేస్తాం, కానీ వాటినుంచి త్వరగా నేర్చుకుంటాం. అదే AI ట్రస్ట్ బేస్” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.