2023 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. రూ. 1896 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. జనవరి 30న నెట్ఫ్లిక్స్లో రీలోడెడ్ వెర్షన్ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 3 గంటల 44 నిమిషాల నిడివి కలిగిన ఈ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్గా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం, అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా ఆకట్టుకుంది. ఫహద్ ఫాజిల్, అనసూయ వంటి నటుల ప్రదర్శనతో పాటు దేవి శ్రీప్రసాద్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ చిత్రం ఓటీటీలో రాకతో అభిమానుల ఆనందం రెట్టింపు అవుతుందనడంలో సందేహమే లేదు.






