
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కొత్త పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం, విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ఎక్స్షోరూం ధరపై 5% వరకు రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా, ఐదేళ్ల పాటు రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. ఈ రాయితీలు 2027 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో మొదటి 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25% వరకు రాయితీ ఇస్తుంది. వివిధ రకాల వాహనాలకు గరిష్ఠ ఎక్స్షోరూం ధరను నిర్ణయించి, ఆ పరిమితిలోపు వాహనాలకే రాయితీలు వర్తిస్తాయి. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించడం, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం లక్ష్యాలు.





