ఆసిస్ అభిమానులకు అంత అతి పనికాదు: బుమ్రా సతీమణి సంజనా గణేశన్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఆసీస్ అభిమానులు మరోసారి అసభ్యంగా విమర్శలు గుప్పించారు. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు కోహ్లీ ఔటైన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ సందర్భంగా క్రీజులో ఉన్నప్పుడు కాస్త కుదురుకుని బ్యాటింగ్ చేసిన కోహ్లీ 36 పరుగులు చేసిన తర్వాత వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు కోహ్లీని ఎగతాళి చేస్తూ అభ్యంతరకర కామెంట్స్ చేశారు.

ఈ ప్రవర్తనతో కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆగి వారి వైపు సీరియస్ గా చూశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్భంది నచ్చచెప్పడంతో లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ ఈ సంఘటనను ఖండించారు. ‘‘భారత అత్యుత్తమ బ్యాటర్‌పై ఇలాంటి ప్రవర్తన అగౌరవకరం. ఆటగాళ్లపై విమర్శలు హద్దుల్లో ఉండాలి’’ అంటూ ట్విటర్ (ఎక్స్‌) వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://twitter.com/iSanjanaGanesan/status/1872552809041957329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1872552809041957329%7Ctwgr%5Eb678512c62291a14282bc2cf7788d85f5fb071dd%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6889977811698869851.ampproject.net%2F2410292120000%2Fframe.html

మ్యాచ్ విశేషాలు

రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ ఇండియా 164/5 స్కోర్‌తో ఉంది. రిషభ్ పంత్ (6*) మరియు రవీంద్ర జడేజా (4*) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా 474 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత జట్టు ఇంకా 310 పరుగుల వెనకబడి ఉంది. ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాల్సి ఉంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *