సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ విషయాన్ని రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాచిగూడ–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07653):
ఈ రైలు జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07654) ఈ రైలు జనవరి 10, 12 తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాచిగూడ చేరుతుంది.
హైదరాబాద్–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07023):
ఈ రైలు జనవరి 10న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07024) జనవరి 11న రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యంగా ఉండాలనే లక్ష్యంతోనే నడపబడుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.






