‘‘తిరుపతిలో సెటిల్ కావాలని నా కల. ముగ్గురు పిల్లల్ని కనాలి.. రోజూ గోవింద నామస్మరణ చేస్తూ, అరటి ఆకులో భోజనం చేయాలని ఉంది’’ అని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ‘‘లుంగీ కట్టుకున్న భర్త ఉంటే, అతనికి మసాజ్ చేయడం నాకు చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది’’ అంటూ ఆమె తన ఫాంటసీని తెలిపారు. తన సింప్లిసిటీతో, ఆచార సంప్రదాయాల పట్ల అభిమానంతో జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.





