ఏలూరులో గణతంత్ర వేడుకలు: జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ ప్రసంగం!!

ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్తమంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌ ప్రసంగంలో జిల్లా అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ చర్యలపై వివరణ ఇచ్చారు.

  • రైతులకు మద్దతు: గతేడాది వరదల వల్ల నష్టపోయిన 6 వేల రైతులకు రూ.7.2 కోట్లు నష్టపరిహారం అందజేశారు.
  • వ్యవసాయ సహకారం: 19 ప్యాక్‌ హౌసులు, 4 కలెక్షన్‌ సెంటర్లు, 2 శీతల గిడ్డంగులు ఏర్పాటుచేశారు.
  • ఉద్యాన పంటలకు ప్రోత్సాహం: డ్రాగన్‌ ఫ్రూట్‌, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు.

సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలు

  • పింఛన్లు: నెలకు రూ.1356 కోట్లు పింఛన్లుగా అందజేస్తున్నారు.
  • గృహ నిర్మాణం: 1.3 లక్షల గృహాలు నిర్మాణంలో ఉన్నాయి.
  • జల్ జీవన్ మిషన్: 4.12 లక్షల ఇళ్లకు నల్లా నీటి సరఫరా.
  • ఉపాధి హామీ పథకం: 3.95 లక్షల మంది కార్మికులకు రూ.260.4 కోట్లు చెల్లించారు.
  • పరిశ్రమల అభివృద్ధి: 3372 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా 16.7 వేల మంది యువతికి ఉపాధి.
  • నిర్వాసితుల పునరావాసానికి రూ.789 కోట్లు మంజూరు చేశారు.
  • 1469 పాఠశాలలకు రూ.430 కోట్ల మౌలిక సదుపాయాలను అందజేశారు.
  • సాంకేతికత ద్వారా పోలీసులు 611 కేసుల్లో రూ.6.5 కోట్ల వాల్యూని రికవర్ చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *