టాలీవుడ్లో కొత్త నటుడిగా ఇబ్రహీం అలీ ఖాన్ ప్రవేశించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం. కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్లో తన తొలి సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని కరణ్ జోహర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా, కరణ్ ఇబ్రహీం కుటుంబంతో ఉన్న తన అనుబంధాలను గుర్తు చేసుకున్నాడు. కరణ్ జోహర్ తన పోస్టులో, “ఫిల్మ్స్ వారి రక్తంలో ఉన్నాయి” అని పేర్కొన్నాడు. ఇబ్రహీం తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాడని ఆశిస్తున్నాడు. ఈ చిత్రం “సర్జమీన” అనే పేరుతో వస్తుందని సమాచారం. ఇందులో కాజోల్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇబ్రహీం ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తండ్రి పోలికతో తనదైన శైలిలో ముందుకు సాగేందుకు ఇబ్రహీం బాగానే కష్టపడుతున్నడని సమాచారం.










