- ఒత్తిళ్లకు లొంగే వ్యక్తిని కాదని మోపిదేవి ఘాటుగా స్పందన
- జగన్ నైజం, అహంకారమే వైకాపా నేతల బహిష్కరణకు కారణం – డొక్కా
తాను ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగిపోయే వ్యక్తిని కాదని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తన గురించి ఏమనుకున్నా, నిజం మాత్రం ఆయన అంతరాత్మకే తెలుసని వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయే స్థితిలో తాను ఎప్పుడూ లేనని, నైతికతతో జీవించే వ్యక్తినని మోపిదేవి అన్నారు.
జగన్కు విశ్వసనీయతపై మాట్లాడే హక్కు లేదన్న డొక్కా
ఇటీవల వైకాపా వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘జగన్ నైజం, ఆయన అహంకారం నచ్చకే ఎంతో మంది వైకాపాను వీడుతున్నారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు’’ అని డొక్కా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.





