జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్.. ప్యాలెస్‌లకే పరిమితమయ్యారని విమర్శ!!

  • ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సూచన
  • ఐదేళ్ల పాలనలో రైతులకు ఒక్క మంచి పని చేయలేదని విమర్శ

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే introspection చేసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మాజీ సీఎం ఐదేళ్లు ప్రజల కోసం కాకుండా ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినా, వారికి పట్టించుకోకుండా పాలన నిర్వహించారని, అందుకే ఈసారి ప్రజలు తీవ్రంగా నిరసించి ఓటమి పాలుచేశారని వ్యాఖ్యానించారు.

మిర్చి రైతుల కోసం జగన్ ఏం చేశాడు?

జగన్ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని అచ్చెన్నాయుడు ఖండించారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మిర్చి పంట సాగవుతుందని, గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మిర్చికి రూ.13,000 ధర సాధారణమేనని తెలిపారు. జగన్‌ హయాంలో రైతులకు ఒక్క మంచి పని చేయలేదని, వ్యవసాయ శాఖను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.1600 కోట్లు తామే చెల్లించామని, ఇప్పుడు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *