శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్బిసి) టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలు చేపడుతున్నామని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ తెలిపారు. ప్రస్తుతం టన్నెల్లో నీటిని బయటకు పంపే పనులు జరుగుతున్నాయని, చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ సాధ్యం కాలేదని ఆయన అన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ) నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎల్అండ్ టి నిపుణులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాలను కూడా సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు నాల్గవ రోజుకు చేరడంతో, సహాయక చర్యలపై సూచనలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం జిఎస్ఐ, ఎన్జిఆర్ఐ నిపుణులను రంగంలోకి దించింది. వీరి సలహాల మేరకు సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.





