- పేరాబత్తుల రాజశేఖరం 16,520 ఓట్లతో ముందంజ
- స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 5,815 ఓట్లు
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 16,520 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 5,815 ఓట్లు పొందారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తపాలా బ్యాలెట్ల ద్వారా 243 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 42 బ్యాలెట్లు చెల్లుబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలైనప్పటికీ, ఓట్ల కట్టలు కట్టడమే రాత్రి 8 గంటల వరకు సాగింది.





