దూకలేదు… ఎగిరి పడ్డాను.. 30 సెకన్లలోనే అంతా జరిగిపోయింది!: విశ్వాస్

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘనీ నగర్‌లోని బీజే వైద్య కళాశాలపై కూలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ (40) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలగానే సీటు 11Aలో ఉన్న విశ్వాస్‌ది విరిగి శిథిలాలతో దూరంగా పడటంతో మంటల నుంచి రక్షణ పొందారు. ఈ ఘటనలో వసతిగృహంలో మరో 24 మంది మృతి చెందారు.

సీటు విరిగి దూరంగా పడటంతో మంటల నుంచి బయటపడ్డా!

విశ్వాస్, డీడీ న్యూస్‌తో మాట్లాడుతూ, “విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలో ముక్కలైంది. నా సీటు విరిగి ఎగిరిపడ్డా. శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకొచ్చా. ఎడమ చేయి మంటలతో గాయమైంది” అన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యుల ప్రకారం, విశ్వాస్‌కు ప్రాణాపాయం లేదు. గుజరాత్‌లో కుటుంబాన్ని కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రక్తపు మరకలతో అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. బ్లాక్ బాక్స్ డీకోడ్‌తో ప్రమాద కారణం తెలియనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *