- రైల్వే వన్ (Railway One) యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లు కొనేవారికి టికెట్ ధరపై 3 శాతం రాయితీ
- ఈ నెల 14 నుంచి జులై 14 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్
- నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు స్టేషన్లలో రద్దీని తగ్గించడమే లక్ష్యం
ప్రతిరోజూ జనరల్ టికెట్ల కోసం రైల్వే స్టేషన్లలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ రద్దీ వర్ణనాతీతం. ప్రయాణికుల ఈ ఇబ్బందులను గమనించిన రైల్వే శాఖ.. టికెట్ బుకింగ్ను మరింత సులభతరం చేస్తూ ‘రైల్వే వన్’ యాప్ను ప్రోత్సహిస్తోంది. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ప్రయాణ భారం తగ్గడమే కాకుండా.. జేబుకు కూడా ఆదా అవుతుంది.(Railway One App Discount General Train Ticket Booking)

“ఇకపై రైల్వే స్టేషన్లో క్యూ కట్టాల్సిన పని లేదు.. మీ అరచేతిలోనే జనరల్ టికెట్.. పైగా డిస్కౌంట్ బోనస్!”
ఇంటి నుంచే టికెట్.. ప్లాట్ఫామ్ టికెట్ కూడా!
సాధారణంగా రాజమహేంద్రవరం వంటి ప్రధాన స్టేషన్లలో రోజూ 4 నుంచి 5 వేల వరకు జనరల్ టికెట్లు, 1500 వరకు ప్లాట్ఫామ్ టికెట్లు అమ్ముడవుతుంటాయి. ఈ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ‘రైల్వే వన్’ యాప్ ఇప్పుడు ప్రయాణికులకు వరంగా మారింది. ఇంటి వద్ద నుంచే ప్రయాణ టికెట్తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ను కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేసేవారికి 3 శాతం రాయితీ ఇవ్వడం ద్వారా ఎక్కువ మందిని ఈ యాప్ వైపు మళ్లించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే స్టేషన్లలో భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
రైల్వే శాఖ తీసుకున్న ఈ 3% డిస్కౌంట్ నిర్ణయం మీకు ఎలా అనిపించింది? ఇకపై మీరు కూడా స్టేషన్ కి వెళ్ళకుండానే యాప్ లో టికెట్ బుక్ చేస్తారా? కామెంట్ చేయండి.





