- ఇన్ కమ్ ట్యాన్స్ పేయర్స్ కి గుడ్న్యూస్
- కొత్త ట్యాక్స్ విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2025-26 బడ్జెట్లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మంచి వార్తలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా ఉండనుంది. వృద్ధులకు వడ్డీపై టీసీఎస్కు ఊరట కల్పించారు. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించడం, బీమా రంగంలో ఎఫ్డీఐని 100 శాతానికి పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా, వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం కూడా ఈ బడ్జెట్లో భాగం.ఈ ప్రకటనలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ఆశిస్తున్నారు. ఆదాయపు పన్నులో సులభతరం, రైతులకు మద్దతు వంటి అంశాలు ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి.






