- ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్న ప్రధాని మోదీ.
- మోదీ అమెరికాలో పర్యటించడానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన భేటీ కానున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ సందర్భంగా మోదీకి విందు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఫ్రాన్స్ నుంచి వాషింగ్టన్ పర్యటన
ప్రధాని మోదీ ఫిబ్రవరి రెండో వారంలో మొదట ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. 12వ తేదీన వాషింగ్టన్ చేరుకున్న తర్వాత, ఆయన 14వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో ఆయన ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం. అనంతరం, మోదీ కార్పొరేట్ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.





