తీవ్ర అల్పపీడనం: పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనించి, ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తా తీరాలను చేరుకోవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు భారీ వర్షాలు పడతాయని అంచనా. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చు.

తీవ్ర అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారింది. తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచించారు. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వాతావరణ మార్పుల కారణంగా కోస్తా ప్రాంతాల్లో అల్పపీడనాలు పెరుగుతున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *