- వైసీపీ హయాంలో అవినీతి జరిగినట్లు గుర్తింపు
- అకస్మిక తనిఖీలు, అవినీతికి పాల్పడ్డ అధికారుల సస్పెన్షన్
జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించామని, ఇందులో సాక్ష్యాధారాలు లేని కారణంగా రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటివరకు రూ.71 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు.
ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు
సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడని, ఆయనను తొలగించామని పవన్ చెప్పారు. విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్త అధికారులను నియమించామని, అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు. ఉపాధి హామీ కూలీల వేతనాల పెంపుపై నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని వివరించారు.





