ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ప్రపంచానికి గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించారు. సుస్థిరాభివృద్ధి సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇంధన సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రముగా నిలపాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
పునరుత్పాదక ఇంధనంలో ఏపీ విజయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, 1999లో విద్యుత్ సంస్కరణలు ప్రారంభించటం వల్ల రాష్ట్రానికి ఏర్పడిన ప్రయోజనాలను గుర్తు చేశారు. సౌర మరియు పవన విద్యుత్ రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి, పునరుత్పాదక ఇంధనంలో దేశానికే మార్గనిర్దేశకంగా నిలిచిన ఏపీ, కొత్త ప్రాజెక్టుల ద్వారా మరింత ముందుకు సాగనుంది.
- పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు: ఎన్టీపీసీ, ఏపీ జెన్కో భాగస్వామ్యంతో రూ.21 బిలియన్ డాలర్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడింది.
- రిలయన్స్ బయోఫ్యూయల్ ప్లాంట్లు: రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.65,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన రిలయన్స్ సంస్థ, ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ను కీలక భాగస్వామిగా తీసుకువస్తోంది.
దూరదృష్టి, ముందుచూపు
సీఎం చంద్రబాబు 1995లో సీఐఐతో ప్రారంభమైన భాగస్వామ్యాన్ని, హైద్రాబాద్ను ఐటీ మరియు ఆరోగ్య రంగాల్లో గ్లోబల్ హబ్గా మార్చిన దూరదృష్టిని ప్రస్తావించారు. ఇంధన రంగంలో జరిగిన మార్పులే గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్లో ముందడుగు వేయడానికి బలమైన పునాది అయ్యాయన్నారు.






