విమానయాన రంగానికి కొత్త ఊపిరి.. కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి భారీ నిధులు!!

  • కొత్త ఉడాన్‌ పథకం: మరో 120 రూట్లలో అమలు
  • 10 ఏళ్లలో లక్ష్యం: 4 కోట్ల మంది విమాన ప్రయాణం
  • బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు
  • కృత్రిమ మేధ అభివృద్ధికి ₹500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
  • క్లీన్‌టెక్‌ మిషన్‌ కింద సోలార్‌, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
  • పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ మానుఫ్యాక్చరింగ్‌ మిషన్
  • రాష్ట్రాలకు ₹1.5 లక్షల కోట్ల రుణాలు
  • 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు ₹2 కోట్ల టర్మ్ లోన్

కేంద్ర బడ్జెట్‌లో ‘ఉడాన్’ పథకాన్ని మరింత విస్తరించి మరో 120 రూట్లలో అమలు చేయనుంది. 10 ఏళ్లలో 4 కోట్ల మంది విమాన ప్రయాణం అందుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం విమానయాన రంగాన్ని మరింత విస్తరిస్తోంది. ఇక బిహార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.దేశంలో AI అభివృద్ధికి మూడు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్న కేంద్రం. ఇందుకోసం ₹500 కోట్ల నిధులు కేటాయించనుంది. క్లీన్‌టెక్‌ మిషన్‌ కింద సోలార్‌, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించనుంది. అలాగే, పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్‌ను ప్రవేశపెట్టింది. ₹1.5 లక్షల కోట్ల రుణాలు రాష్ట్రాలకు మంజూరు చేయనున్న కేంద్రం. మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందించనుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ₹2 కోట్ల టర్మ్ లోన్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *