ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులుకి అవకాశం!? అభిమానులు, కార్యకర్తల్లో ఆనందం!!

తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పదవికి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌ గన్నిని ‘‘ఆప్కాబ్‌ ఛైర్మన్‌’’ అని ఉద్దేశించి మాట్లాడటంతో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలోనే గన్నికి హామీ

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు సీటు జనసేనకు కేటాయించడంతో గన్ని సీటు త్యాగం చేశారు. ఈ పరిణామంలో ఆయనకు కీలకమైన పదవి కేటాయిస్తామని తెదేపా హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇటీవల ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల్లో గన్నికి అవకాశం లభించలేదు. లోకేశ్‌ వ్యాఖ్యలతో గన్ని వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంధర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి భీమడోలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ అంశంపై స్పందించిన గన్ని, పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని శిరోధార్యంగా స్వీకరిస్తానని తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *