అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌: భవిష్యత్‌ నాయకుల తయారీకి కొత్త అడుగు!!

సాంకేతికతతో సమస్యల పరిష్కారానికి, నేతృత్వ లక్షణాల పెంపకానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం, పోటీతత్వ లక్షణాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో, అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ (జీఎల్‌సీ) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ ప్రణాళికలను వివరించారు. సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధ (ఏఐ) మరియు రియల్‌ టైం డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాలను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ముఖ్యమంత్రి, ఈ సెంటర్‌ భవిష్యత్‌ తరాలకు నాయకత్వంలో మార్గనిర్దేశం చేయగలదని స్పష్టం చేశారు.

గ్లోబల్‌ భాగస్వామ్యాలు, ఎల్‌వోఐ కుదుర్చుకున్న ఏపీ

సీఎం చంద్రబాబు వెల్లడించిన ప్రకారం, అమరావతిలో ఏర్పాటు చేయనున్న జీఎల్‌సీ కోసం స్విట్జర్లాండ్‌లోని ఐఎండీ బిజినెస్‌ స్కూల్‌తో పాటు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్లతో లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (ఎల్‌వోఐ) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి గ్లోబల్‌ స్థాయిలో పోటీతత్వం కలిగించే అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సాంకేతిక ఆధారిత శిక్షణతో భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దేందుకు ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సీలబస్‌ రూపొందించడం, ప్రతిభావంతులైన శిక్షకులను నియమించడం ద్వారా గ్లోబల్‌ సెంటర్‌ను ప్రత్యేకమైనదిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *